Marri Rajasekhar Reddy: నా కుటుంబీకులను వేధించారు: మల్లారెడ్డి అల్లుడు

హైదరాబాద్‌: సోదాల పేరిట తన కుమార్తెను 36 గంటల పాటు ఐటీ అధికారులు ఇబ్బంది పెట్టారని.. కుటుంబీకులను వేధించారని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తుర్కియే నుంచి హైదరాబాద్‌ చేరుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇంట్లో ఎవరూ లేనపుడు తల్లిదండ్రులతో కుమార్తెను మాట్లాడించాల్సి ఉంటుందని.. కానీ ఐటీ అధికారులు అలా చేయలేదన్నారు. ప్రతి నెలా రూ.10కోట్లు శాలరీల రూపంలోనే ఇస్తుంటామని చెప్పారు. ఇటీవల కళాశాలల్లో కౌన్సెలింగ్‌ జరగడంతో ఆ డబ్బు అంతా ఇంట్లోనే ఉందన్నారు. నగరంలో లేనందున ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్‌ చేయలేదని మర్రి రాజశేఖర్‌రెడ్డి వివరించారు.

Updated : 24 Nov 2022 14:33 IST

Tags :

మరిన్ని