Puvvada: ఖమ్మంలో 10/10 స్థానాలు గెలిచి చూపిస్తాం: మంత్రి పువ్వాడ

తమ స్వార్థం కోసం పార్టీలో చేరి తర్వాత కేసీఆర్ చేయి విడిచిన వారందరూ శంకరగిరి మాన్యాలే పట్టారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) విమర్శించారు. ఖమ్మం (Khammam)లో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో భారాస (BRS) నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని.. కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో 10కి 10 అసెంబ్లీ స్థానాలను భారాస గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

Published : 16 Apr 2023 15:57 IST

తమ స్వార్థం కోసం పార్టీలో చేరి తర్వాత కేసీఆర్ చేయి విడిచిన వారందరూ శంకరగిరి మాన్యాలే పట్టారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) విమర్శించారు. ఖమ్మం (Khammam)లో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో భారాస (BRS) నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని.. కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో 10కి 10 అసెంబ్లీ స్థానాలను భారాస గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

Tags :

మరిన్ని