Roja: గోరంట్ల మాధవ్‌ది తప్పని తేలితే జగన్‌ చర్యలు తీసుకుంటారు: మంత్రి రోజా

ఎంపీ గోరంట్ల మాధవ్‌ తప్పు నిరూపితమైతే.. ఆయనపై సీఎం జగన్‌ తప్పకుండా చర్యలు తీసుకుంటారని మంత్రి రోజా అన్నారు. విచారణ చేసేందుకు కొంత సమయం ఉంటుందని తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. టీవీ కార్యక్రమాలకు రూ. లక్షల్లో రెమ్యునరేషన్‌ తీసుకునే తాను కారు కొనుగోలు చేయడంపై జనసేన, తెదేపా నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

Published : 07 Aug 2022 14:22 IST

Tags :

మరిన్ని