Srinivas Goud: ఎన్నేళ్లకయినా కేసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం కేటీఆరే!: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఎన్నేళ్లకయినా కేసీఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ మాత్రమేనని ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. తెరాసలో ఎవరిని అడిగినా ఇదే చెబుతారన్నారు. ఎన్నికల కమిషన్, కేంద్రం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో మునుగోడు ఉపఎన్నికల్లో భాజపా నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా భాజపా గెలిచే ప్రసక్తే లేదన్నారు. మునుగోడులో గెలిచిన తర్వాత దేశంలో భాజపాను ఎదుర్కొనేందుకు కేసీఆర్ బయలు దేరుతారన్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే ఎవరు కాదన్నారన్న శ్రీనివాస్ గౌడ్.. గతంలో చిరంజీవి పార్టీ చేయలేదా అని వ్యాఖ్యానించారు.

Published : 19 Oct 2022 15:42 IST

ఎన్నేళ్లకయినా కేసీఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ మాత్రమేనని ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. తెరాసలో ఎవరిని అడిగినా ఇదే చెబుతారన్నారు. ఎన్నికల కమిషన్, కేంద్రం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో మునుగోడు ఉపఎన్నికల్లో భాజపా నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా భాజపా గెలిచే ప్రసక్తే లేదన్నారు. మునుగోడులో గెలిచిన తర్వాత దేశంలో భాజపాను ఎదుర్కొనేందుకు కేసీఆర్ బయలు దేరుతారన్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే ఎవరు కాదన్నారన్న శ్రీనివాస్ గౌడ్.. గతంలో చిరంజీవి పార్టీ చేయలేదా అని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని