Aquarium: కూకట్‌పల్లిలో అండర్‌ వాటర్‌ టన్నెల్‌ అక్వేరియం..

సరికొత్త అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎక్స్ పో-2023కి హైదరాబాద్ వేదిక అయ్యింది. కూకట్‌పల్లిలోని మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఎదురుగా ట్రక్‌ పార్కింగ్‌ మైదానంలో సాయంత్రం 6 గంటల 30నిమిషాలకు మంత్రులు KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమ్యూజ్‌మెంట్‌లతో పాటు 500 రకాల సముద్ర చేపలతో అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఏర్పాటు చేసినట్లు ఫన్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. అరభైమా రకం చేప సుమారు 60 కిలోలు ఉండగా.. దాని విలువ రూ.6లక్షల వరకు ఉంటుంది. ఇది రోజుకు కిలోన్నర చికెన్‌ తింటుంది. ప్రదర్శన ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు 60రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.

Updated : 14 Apr 2023 14:30 IST
Tags :

మరిన్ని