Nara Lokesh: ‘రాయలసీమ డిక్లరేషన్‌’పై లోకేశ్‌ కీలక ప్రకటన

రాయలసీమ డిక్లరేషన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు. కడపలో ‘మిషన్‌ రాయలసీమ’ పేరుతో ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. ‘‘వాటర్‌ గ్రిడ్‌ ద్వారా సీమలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తాం. పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. ఫార్మ్స్‌ ఏర్పాటుకు రాయితీ రుణాలు అందజేస్తాం. స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా రాయలసీమను తీర్చిదిద్దుతాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Updated : 07 Jun 2023 21:28 IST

మరిన్ని