Andhra News: వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన మానవహారంలో అపశ్రుతి

అనకాపల్లి జిల్లా చోడవరంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన మానవహారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని హల్‌చల్ చేశాడు. బైకుపై పెట్రోల్ పోసిన వ్యక్తి తరువాత తనపై పోసుకున్నాడు. వైకాపా నాయకులు, కార్యకర్తలు అతనిని నిలువరిస్తుండగా హఠాత్తుగా బైకుకు నిప్పంటుకుంది. ఘటనలో ఎవరికీ ఏమీ జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Published : 13 Oct 2022 18:26 IST
Tags :

మరిన్ని