Anam: ప్రశ్నించే గొంతుకలను వైకాపా సర్కారు అణచివేస్తోంది: ఆనం రామనారాయణ రెడ్డి
ప్రశ్నించే గొంతుకలను వైకాపా సర్కారు అణచివేస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ఆరోపణతో తనను సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్యే స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇలాంటి దుస్థితి రావడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతూ వస్తున్నాయని చెప్పారు.
Published : 26 Mar 2023 12:10 IST
Tags :