Eatala Vs BRS MLAs: ‘గది కేటాయింపు’పై అధికార భారాస, భాజపా మధ్య సంవాదం

అసెంబ్లీలో గది కేటాయింపు అంశంపై శాసనసభ (TS Assembly)లో అధికార భారాస, భాజపా మధ్య సంవాదం జరిగింది. బడ్జెట్‌పై సాధారణ చర్చలో భాగంగా మాట్లాడుతూ.. అసెంబ్లీకి వచ్చిన తమకు అల్పాహారం చేసేందుకు కూడా సదుపాయం లేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Etela Rajender).. సభాపతి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు విన్నవించినా  గదిని కేటాయించకపోవటం అవమానించటమేనన్నారు. ఈటల తీరును మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. ఏదైనా ఉంటే సభాపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసానిలు సైతం జోక్యం చేసుకొని  తమ సౌకర్యాల కోసం సభాసమయాన్ని వృథా చేయవద్దని హితవు పలికారు.

Updated : 09 Feb 2023 08:44 IST
Tags :

మరిన్ని