MLA poaching case: భాజపా కొత్త కుట్రకు తెర లేపింది.. తగ్గేదేలే: పైలట్‌ రోహిత్‌ రెడ్డి

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను బయటపెట్టినందుకే.. ఈడీతో భాజపా తనను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఆరోపించారు. వాళ్లు అనుకున్నది అనుకున్నట్టు ఏదీ జరగలేదు కాబట్టే.. తాజాగా మరో కొత్త కుట్రకు భాజపా తెర లేపిందన్నారు. ఈ మేరకు నందకుమార్‌తో వాంగ్మూలం తీసుకొని.. తనను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారన్నారు. భాజపా ఎన్ని కుట్రలు చేసినా.. తాను మాత్రం లొంగేదే లేదని.. దీనిపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు బీఎల్ సంతోశ్‌, తుషార్‌లు తప్పులు చేయకుంటే ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని రోహిత్‌ రెడ్డి నిలదీశారు. 

Updated : 25 Dec 2022 21:08 IST

Tags :

మరిన్ని