MLA poaching case: ఈడీ, సీబీఐ ఏదొచ్చినా మేం సిద్ధమే: రోహిత్‌ రెడ్డి

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్పందించారు. తనను విచారించినప్పుడు ఈడీ అధికారులకు ఏమీ దొరకలేదని, అందుకే సీబీఐని రంగంలోకి దించారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా రాలేదని.. ఆ కాపీ చూసిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘ఈ కేసులోని వ్యక్తులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన భాజపా నేతలు.. నిందితులకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు. ఈడీ, సీబీఐ ఏది వచ్చినా మేం సిద్ధంగానే ఉన్నాం’ అని స్పష్టం చేశారు. 

Published : 26 Dec 2022 20:21 IST
Tags :

మరిన్ని