YSRCP: మహిళపై వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ‘సంక్షేమ పథకాలు తీసుకుంటూ.. మా ప్రభుత్వాన్నే విమర్శిస్తారా?’ అంటూ ఓ కుటుంబంపై మండిపడ్డారు. తెలుగుదేశం చేపట్టిన 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి'అనే కార్యక్రమానికి హాజరైన రాజ్యలక్ష్మి అనే మహిళ.. వైకాపా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆమె వ్యాఖ్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే అంతు చూస్తానని హెచ్చరించారు. రాజ్యలక్ష్మి భర్త పంప్  ఆపరేటర్‌గా పనిచేస్తుండగా.. అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించాలని స్వయంగా తానే ఆదేశించినట్లు ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు.  

Updated : 05 Dec 2022 15:26 IST

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ‘సంక్షేమ పథకాలు తీసుకుంటూ.. మా ప్రభుత్వాన్నే విమర్శిస్తారా?’ అంటూ ఓ కుటుంబంపై మండిపడ్డారు. తెలుగుదేశం చేపట్టిన 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి'అనే కార్యక్రమానికి హాజరైన రాజ్యలక్ష్మి అనే మహిళ.. వైకాపా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఆమె వ్యాఖ్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే పిచ్చిపిచ్చిగా మాట్లాడితే అంతు చూస్తానని హెచ్చరించారు. రాజ్యలక్ష్మి భర్త పంప్  ఆపరేటర్‌గా పనిచేస్తుండగా.. అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించాలని స్వయంగా తానే ఆదేశించినట్లు ప్రసన్నకుమార్ రెడ్డి వెల్లడించారు.  

Tags :

మరిన్ని