మధ్యాహ్న భోజనం కోడిగుడ్లను కాకులు ఎత్తుకుపోయాయట!.. ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
విద్యార్థులకు వడ్డించే కోడిగుడ్లను కాకులు ఎత్తుకుపోయాయట. మధ్యాహ్న భోజన కార్మికురాలు చెప్పిన ఈ సమాధానంతో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కంగుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం వేగూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే.. జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య కన్నా కోడిగుడ్లు తక్కువగా ఉండటంతో మధ్యాహ్న భోజన కార్మికురాలిని ప్రశ్నించారు. కోడిగుడ్లు పాడైపోవడంతో పడేశానని, వాటిని కాకి ఎత్తుకుపోయిందని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికురాలిని విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
Updated : 31 May 2023 16:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ