మధ్యాహ్న భోజనం కోడిగుడ్లను కాకులు ఎత్తుకుపోయాయట!.. ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

విద్యార్థులకు వడ్డించే కోడిగుడ్లను కాకులు ఎత్తుకుపోయాయట. మధ్యాహ్న భోజన కార్మికురాలు చెప్పిన ఈ సమాధానంతో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కంగుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం వేగూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే.. జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య కన్నా కోడిగుడ్లు తక్కువగా ఉండటంతో మధ్యాహ్న భోజన కార్మికురాలిని ప్రశ్నించారు. కోడిగుడ్లు పాడైపోవడంతో పడేశానని, వాటిని కాకి ఎత్తుకుపోయిందని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికురాలిని విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

Updated : 31 May 2023 16:02 IST

విద్యార్థులకు వడ్డించే కోడిగుడ్లను కాకులు ఎత్తుకుపోయాయట. మధ్యాహ్న భోజన కార్మికురాలు చెప్పిన ఈ సమాధానంతో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కంగుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం వేగూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే.. జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య కన్నా కోడిగుడ్లు తక్కువగా ఉండటంతో మధ్యాహ్న భోజన కార్మికురాలిని ప్రశ్నించారు. కోడిగుడ్లు పాడైపోవడంతో పడేశానని, వాటిని కాకి ఎత్తుకుపోయిందని సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికురాలిని విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

Tags :

మరిన్ని