Vallabhaneni Vamsi: తెదేపా నేత భూమిలో ఎమ్మెల్యే వంశీ హల్‌చల్‌

గన్నవరం: కోర్టు వివాదంలో ఉన్న తెలుగుదేశం నేతకు చెందిన భూమిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హల్ చల్ చేశారు. తెదేపా నేత జాస్తి వెంకటేశ్వరరావుకు చెందిన  వెదురు పావులూరులోని 99 సెంట్ల భూమి ఉంది. ఐతే.. ఈ భూమి డీపట్టా ప్రస్తుతం జాస్తి వెంకటేశ్వరరావు పేరిటే ఉంది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో.. వెంకటేశ్వరరావు హైకోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినా సదరు భూమిలోకి ఎమ్మెల్యే వంశీ రెవెన్యూ అధికారులను వెంటబెట్టుకుని వెళ్లారు. భూమిని స్వాధీనం చేసుకుని నివేశనస్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని... వెంకటేశ్వరరావు  ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు బెదిరేది లేదని స్పష్టం చేశారు.

Published : 19 May 2023 11:59 IST
Tags :

మరిన్ని