Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రామచంద్ర భారతికి రెండు పాస్‌పోర్టులు..!

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగుచూస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి రెండు పాస్‌పోర్టులు ఉన్నట్లు గుర్తించారు. రామచంద్ర భారతి పేరుతో ఒకటి.. భరత్ కుమార్ శర్మ పేరుతో మరొకటి ఉన్నట్లు తేలింది. ఇప్పటికే రామచంద్ర భారతి పేరు సతీశ్ శర్మగా చెలామణిలో ఉంది. మరోవైపు ఈ కేసులో ఏకంగా లక్ష పేజీల నిడివి ఉండే సమాచారం సిట్ సేకరించినట్లు తెలుస్తోంది.

Published : 24 Nov 2022 09:14 IST
Tags :

మరిన్ని