BRS: నన్ను పిలవట్లేదు: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదన

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరిగే భారాస (BRS) పార్టీ సమావేశాలు, అధికారిక కార్యక్రమాలకు తనను పిలవడంలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్యే రాజయ్య తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడియం హాజరయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సమావేశాలకు, సభలకు తనను వాడుకుంటున్నారని, ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాలకు, సమావేశాలకు తనను పిలవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 02 Apr 2023 14:20 IST

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరిగే భారాస (BRS) పార్టీ సమావేశాలు, అధికారిక కార్యక్రమాలకు తనను పిలవడంలేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్యే రాజయ్య తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడియం హాజరయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద సమావేశాలకు, సభలకు తనను వాడుకుంటున్నారని, ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాలకు, సమావేశాలకు తనను పిలవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని