Koushik Reddy: ‘రైతు బంధు తీసుకోవట్లేదా? సిగ్గులేదా?’.. రైతుపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆగ్రహం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైతు దినోత్సవంలో రైతుపై భారాస నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy) విరుచుకుపడ్డారు. రుణమాఫీ గురించి అడిగిన ఓ రైతుపై.. ‘రైతు బంధు తీసుకుంటలేవా..? సిగ్గులేదా..?’ అంటూ కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. జమ్మికుంటలో రైతు దినోత్సవానికి హాజరైన కౌశిక్ రెడ్డి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న క్రమంలో ఓ రైతు.. రుణమాఫీ గురించి ప్రశ్నించారు. ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి.. ‘రైతుబంధు, పింఛన్లు, ఉచిత కరెంటు ఇస్తున్నాం. సిగ్గులేకుండా రుణమాఫీ గురించి ఎలా అడుగుతున్నావు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ గురించి అడిగితే కౌశిక్ రెడ్డి తనపై విరుచుకుపడ్డారంటూ ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
Updated : 04 Jun 2023 13:01 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్