Koushik Reddy: ‘రైతు బంధు తీసుకోవట్లేదా? సిగ్గులేదా?’.. రైతుపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆగ్రహం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైతు దినోత్సవంలో రైతుపై  భారాస నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddy) విరుచుకుపడ్డారు. రుణమాఫీ గురించి అడిగిన ఓ రైతుపై.. ‘రైతు బంధు తీసుకుంటలేవా..? సిగ్గులేదా..?’ అంటూ కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. జమ్మికుంటలో రైతు దినోత్సవానికి హాజరైన కౌశిక్ రెడ్డి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్న క్రమంలో ఓ రైతు.. రుణమాఫీ గురించి ప్రశ్నించారు. ఆగ్రహానికి గురైన కౌశిక్ రెడ్డి.. ‘రైతుబంధు, పింఛన్లు, ఉచిత కరెంటు ఇస్తున్నాం. సిగ్గులేకుండా రుణమాఫీ గురించి ఎలా అడుగుతున్నావు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ గురించి అడిగితే కౌశిక్ రెడ్డి తనపై విరుచుకుపడ్డారంటూ ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు

Updated : 04 Jun 2023 13:01 IST

Koushik Reddy: ‘రైతు బంధు తీసుకోవట్లేదా? సిగ్గులేదా?’.. రైతుపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆగ్రహం

Tags :

మరిన్ని