Munugode: అప్పుడే మునుగోడు ప్రచారం గురించి ఆలోచిస్తా: ఎంపీ కోమటిరెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక వేళ పీసీసీ తీరుపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మునుగోడు ఉప ఎన్నిక గురించి నాతో ఎవరూ మాట్లాడట్లేదు. దాని గురించి నాకేం తెలియదు’’ అని అన్నారు.

Published : 12 Aug 2022 17:06 IST
Tags :

మరిన్ని