Munugode bypoll: రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు..!

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓపెన్ టాప్ వాహనంలో ఆయన  ప్రచారం నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. రాజగోపాల్ గోబ్యాక్ అంటూ నినదించారు. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని నినాదాలు చేశారు. వారిని భాజపా శ్రేణులు అడ్డుకున్నాయి. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Published : 15 Oct 2022 15:21 IST

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓపెన్ టాప్ వాహనంలో ఆయన  ప్రచారం నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. రాజగోపాల్ గోబ్యాక్ అంటూ నినదించారు. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని నినాదాలు చేశారు. వారిని భాజపా శ్రేణులు అడ్డుకున్నాయి. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని