Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో తల్లీకూతుళ్లపై.. ట్రాక్టర్‌తో మట్టి పోసి హత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం జరిగింది. ఆస్తి తగాదాలతో వారిపై ట్రాక్టర్‌తో మట్టి పోసి చంపాలని చూశారు. స్థానికులు గమనించి వారిని కాపాడారు. గ్రామానికి చెందిన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాశ్ రావు తమ స్థలాన్ని కబ్జా చేశారంటూ... తల్లీకూతుళ్లు కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. 2019లో వీరిద్దరూ నిరాహార దీక్ష కూడా చేశారు.

Published : 07 Nov 2022 19:01 IST

Tags :

మరిన్ని