Crime News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు తెలంగాణ వాసులు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను.. లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

Published : 17 May 2023 19:52 IST
Tags :

మరిన్ని