NTR: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు

హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, పురందశ్వేరి సహా పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. తెల్లవారుజామునే సమాధి వద్దకు చేరుకున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పుష్పగుచ్చాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ పురందేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. 

Published : 28 May 2022 13:56 IST
Tags :

మరిన్ని