Nara Lokesh: యువగళం పాదయాత్రకు బయలుదేరిన లోకేశ్‌

యువగళం (Yuvagalam) పాదయాత్రకు హైదరాబాద్‌లోని ఇంటివద్ద నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) బయలుదేరారు. తొలుత ఇంటి వద్ద లోకేశ్‌ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు. అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి కడపకు వెళ్లగా, అక్కడ గజమాలతో తెదేపా శ్రేణులు లోకేశ్‌ ఘన స్వాగతం పలికారు. కాగా, ఈ నెల 27న కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం కానుంది.

Updated : 25 Jan 2023 18:48 IST

Tags :

మరిన్ని