Nara Lokesh: తెదేపా నేతను పరామర్శించేందుకు కడప సెంట్రల్‌ జైలుకు నారా లోకేశ్‌

కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రొద్దుటూరు తెదేపా నేత ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ అక్కడికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కేంద్రకారాకారం వద్ద భారీగా తెదేపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైల్లో మూలాఖత్‌కు  గంటసేపు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

Published : 18 Oct 2022 12:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు