AP News: మంత్రి ఆదిమూలపు సురేష్ పారా గ్లైడింగ్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

పారా గ్లైడింగ్‌ చేసేందుకు ప్రయత్నించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్‌లో జీ 20 సదస్సు సన్నాహక మారథాన్ ప్రారంభం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మారథాన్ ప్రారంభంలో భాగంగా మంత్రి ఆది మూలపు సురేష్ పారా గ్లైడింగ్‌కు సిద్దమయ్యారు. మోటార్‌ పారా గ్లైడింగ్‌ వాహనం మొదట్లోనే కాస్త ఒరిగింది. పారాచూట్‌ను నిర్వాహక సిబ్బంది వెంటనే అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. మారథాన్‌ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజని పాల్గొన్నారు.

Published : 26 Mar 2023 10:48 IST

AP News: మంత్రి ఆదిమూలపు సురేష్ పారా గ్లైడింగ్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

Tags :

మరిన్ని