Warangal: వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి శోభ..
వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
Published : 26 Sep 2022 12:27 IST
Tags :