Ayodhya: అయోధ్య రామయ్య విగ్రహం తయారీకి.. నేపాల్ గండకీ నది పవిత్ర శిలలు
అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి భక్తులకు శ్రీరాముడి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో పనులు ముందుకు సాగుతున్నాయి. అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహం కోసం నేపాల్లోని గండకీ నది నుంచి అత్యంత పవిత్రమైనవిగా భావించే శాలిగ్రామ శిలలను తీసుకొస్తున్నారు. గండకీ నది చెంత మాత్రమే లభించే ఈ ప్రత్యేక శిలలను పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్యకు తరలించారు.
Published : 30 Jan 2023 16:51 IST
Tags :