AP News: ఆ డబ్బులతో నా భర్త తాగుతున్నాడు.. పింఛను నాకే ఇవ్వండి

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. నియోజకవర్గ పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్య పల్లెలో ప్రజలకు ఆయన ప్రభుత్వ పథకాలు వివరిస్తూ పర్యటించారు. అయితే గంజిగుంట లక్ష్మమ్మ అనే వృద్ధురాలు.. తన భర్తకు పింఛన్‌ ఇస్తే తాగుడుకే ఖర్చు చేస్తున్నాడని ఎమ్మెల్యే ఎదుట వాపోయింది. తన భర్తకు బదులుగా తనకే పింఛన్‌ ఇవ్వాలని కోరింది. వెంటనే వాలంటీర్‌ను పిలిచి లక్ష్మమ్మ భర్తకు పింఛన్‌ రద్దు చేసి.. ఆమెకే మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 

Updated : 31 May 2023 16:08 IST

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. నియోజకవర్గ పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్య పల్లెలో ప్రజలకు ఆయన ప్రభుత్వ పథకాలు వివరిస్తూ పర్యటించారు. అయితే గంజిగుంట లక్ష్మమ్మ అనే వృద్ధురాలు.. తన భర్తకు పింఛన్‌ ఇస్తే తాగుడుకే ఖర్చు చేస్తున్నాడని ఎమ్మెల్యే ఎదుట వాపోయింది. తన భర్తకు బదులుగా తనకే పింఛన్‌ ఇవ్వాలని కోరింది. వెంటనే వాలంటీర్‌ను పిలిచి లక్ష్మమ్మ భర్తకు పింఛన్‌ రద్దు చేసి.. ఆమెకే మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 

Tags :

మరిన్ని