Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం.. విద్యుత్ షాక్‌తో 40 మంది మృతి..!

ఒడిశా (Odisha) రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో దాదాపు 40 మంది విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు, రక్తస్రావం లేకపోవడమే అందుకు కారణం. ప్రమాద సమయంలో విద్యుత్  తీగలు బోగీలపై పడటంతో విద్యుదాఘాతంతో వీరి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు దాదాపు వంద మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉండగా ఎక్కువకాలం వీటిని భద్రపర్చడం మంచి కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Published : 06 Jun 2023 16:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు