Viral Video: భూమి కంపిస్తున్నా.. వార్తలు చదవడం ఆపని యాంకర్‌

పాకిస్థాన్‌లో భూకంపం సంభవించినా.. ఓ టీవీ యాంకర్ కదలకుండా వార్తలు చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెషావర్‌లోని స్థానిక టీవీ ఛానెల్ స్టూడియోలో ఈ సంఘటన జరిగింది. వార్తలను యాంకర్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా.. భూకంపం ధాటికి స్టూడియోలోని వస్తువులన్నీ కదలడం ప్రారంభించాయి. అయినప్పటికీ ఆ యాంకర్ అలాగే వార్తలు చదివాడు. యాంకర్ వెనకాల ఉన్న న్యూస్ రూమ్‌లోని టీవీలు, ఇతర పరికరాలన్నీ కదిలినట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది.  

Updated : 22 Mar 2023 22:38 IST
Tags :

మరిన్ని