CM Jagan: జగన్ పర్యటన.. నరసన్నపేట అష్టదిగ్బంధం..!

శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజలు, విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లకు ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర బారికేడ్లు పెట్టడంతో విద్యార్థులు, స్థానికులు వాటి కింద నుంచే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు నరసన్నపేట ఖాకీపేటగా మారింది. శ్రీకాకుళం జిల్లానే కాకుండా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి అదనపు బలగాలను మోహరించారు. సుమారు రెండు వేల మంది పోలీసుల దిగ్బంధంలో నరసన్నపేట ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సులు, ఆటోలు లేక విద్యార్థులు నడుచుకుంటూ కళాశాలలకు వెళ్తున్నారు.

Updated : 23 Nov 2022 10:29 IST

Tags :

మరిన్ని