PM Modi: అభిమానికి అరుదైన కానుక ఇచ్చిన ప్రధాని మోదీ

పర్యటనలతో నిత్యం బిజీగా ఉండే ప్రధాని మోదీ.. తన అభిమానికి అరుదైన కానుక ఇచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్‌లో ఉన్న మోదీ.. జాంనగర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు భారీగా తరలిరావడంతో తన కాన్వాయ్‌ దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని తన తల్లితో కలిసి ఉన్న చిత్రాన్ని మోదీకి అందజేశారు. దీనికి సంతోషించిన ప్రధాని.. మరో ఫొటోను కూడా తెప్పించుకున్నారు. దానిపై సంతకం చేసి ఆ అభిమానికి గుర్తుగా అందజేశారు.

Published : 11 Oct 2022 10:45 IST

Tags :

మరిన్ని