Mann Ki Baat: ప్రధాని మోదీ నోట తన పేరు.. ఉద్వేగానికి లోనైన సిరిసిల్ల వాసి

ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ తన స్వహస్తాలతో నేసిన G-20 లోగోను తనకు పంపినట్లు వెల్లడించారు. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానన్న మోదీ.. హరిప్రసాద్ తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో నైపుణ్యం ఉందని కొనియాడారు. అయితే, మోదీ తన పేరు ప్రస్తావించడం పట్ల హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఊహించని భాగ్యం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యారు. మరోవైపు హరిప్రసాద్‌ను కలిసి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సన్మానించారు.

Published : 27 Nov 2022 17:43 IST

Tags :

మరిన్ని