Modi: స్వాతంత్య్ర సమరయోధుడి కుమార్తెకు మోదీ పాదాభివందనం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ... స్వాతంత్య్ర సమర యోధుడు పసల కృష్ణమూర్తి కుమార్తె.. కృష్ణభారతికి పాదాభివందనం చేశారు. ఆమె తల్లిదండ్రులు..పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. బ్రిటీషర్లు వారిని జైలులో వేశారు. అప్పుడు అంజలక్ష్మి ఆరు నెలల గర్భిణిగా ఉన్నారు. జైల్లోనే కృష్ణ భారతికి జన్మనిచ్చారు.
Published : 04 Jul 2022 19:12 IST
Tags :