Padma Awards: 2023 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రదానం

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 50 మందికి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. 2023 ఏడాదికి గాను ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా.. అందులో 50 మందికి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో... ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ పాల్గొన్నారు.

Published : 22 Mar 2023 21:35 IST
Tags :

మరిన్ని