5G : 5జీ.. దేశవ్యాప్తంగా 3 ఏళ్లలో

ప్రస్తుత 4జీ సేవలతో పోలిస్తే 10 రెట్ల వేగంతో డేటా బదిలీకి వీలున్న 5జీ సేవలు అక్టోబరులో ప్రారంభమవుతాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ గురువారం తెలిపారు. టెలికాం సేవల ఛార్జీలు ప్రపంచంలోనే మన దగ్గర చౌక అని, 5జీ  ఛార్జీలు కూడా అందుబాటులోనే ఉంటాయని పరిశ్రమ భరోసా ఇచ్చిందని వివరించారు. తొలుత హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చండీగఢ్‌, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, జామ్‌నగర్‌, లఖ్‌నవూ, పుణెలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

Published : 26 Aug 2022 08:42 IST

Tags :

మరిన్ని