రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెదపారుపూడిలో అభివృద్ధి కార్యక్రమాలు

కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్‌ శైలజాకిరణ్ ప్రారంభించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ఇప్పటివరకూ రూ.89 కోట్లు ఖర్చు చేసి.. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని శైలజాకిరణ్‌ తెలిపారు. రామోజీరావు స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామాన్ని 2015లో దత్తత తీసుకుని.. రూ.16.50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు.

Updated : 05 Feb 2023 19:50 IST

Tags :

మరిన్ని