KKR vs RR: సునామీలా విరుచుకుపడ్డ యశస్వి.. రాజస్థాన్ గెలుపు సంబరాలు చూశారా!
కోల్కతా: గత మూడు మ్యాచుల్లో ఓడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. కోల్కతాపై 9 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. తొలుత కోల్కతాను 149 పరుగులకే కట్టడి చేసిన రాజస్థాన్.. తర్వాత బ్యాటింగ్లో తన ప్రతాపాన్ని చూపింది. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ (98*; 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్లు) సునామీలా విరుచుకుపడ్డాడు. సంజూ శాంసన్ (48*; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 ఫోర్లు) అదరగొట్టాడు. ఎడాపెడా సిక్స్లు, ఫోర్లతో వీరిద్దరూ బ్యాటింగ్ చేయడంతో కోల్కతా బౌలర్లు నిశ్చేష్టులయ్యారు. వీరి విధ్వంసంతో కేవలం 13.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి రాజస్థాన్ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రాజస్థాన్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటయాయి.
Updated : 11 May 2023 23:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు