Ayodhya: నేపాల్‌ నుంచి అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో రామ మందిర నిర్మాణానికి నేపాల్ ప్రభుత్వం కానుకగా ఇచ్చిన సాలగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. నేపాన్‌లోని జనక్‌పుర్ నుంచి వచ్చిన ఈ శిలలు బుధవారం రాత్రి అయోధ్య నగరానికి చేరాయి. ఈ రాళ్లతో రాముడి విగ్రహం తయారీకి నిర్వాహకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సాలగ్రామ్ రాళ్ల రాక సందర్భంగా భక్తులు బాణసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. దీంతో అయోధ్య నగరవీధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి.

Published : 02 Feb 2023 18:34 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు