Revanth Reddy: దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా రాహుల్‌ గాంధీ సిద్ధం: రేవంత్‌

ప్రధాని మోదీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలో ప్రజలు గొప్ప నాయకుడిని చూస్తున్నారని.. భారత్ జోడో యాత్రకు మద్దతుగా అందరూ కదలిరావాలని కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు వారి సమస్యలను రాహుల్‌కు వివరిస్తున్నారన్నారు. 

Updated : 06 Nov 2022 13:50 IST
Tags :

మరిన్ని