Revanthreddy: మోదీని నిలదీస్తేనే కేసీఆర్‌ను ప్రజలు నమ్ముతారు: రేవంత్‌

ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి, నాయకులను వేధించడానికి కేంద్రంలో భాజపా, తెలంగాణలో తెరాస సర్కారు.. ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. దేశ భద్రతకోసం వినియోగించాల్సిన సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగించడం దారుణమన్నారు.రేవంత్ రెడ్డి మీడియా సమావేశం

Published : 06 Aug 2022 19:47 IST

Tags :

మరిన్ని