KKR vs PVBKS: చివరి బంతికి ఫోర్‌ కొట్టిన రింకు.. కోల్‌కతా గెలుపు సంబరాలు చూశారా..

కోల్‌కతా: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో జట్ల మధ్య రోజురోజుకు రసవత్తర పోరు జరుగుతోంది. చివరి వరకు ఏ జట్టు నెగ్గుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా కోల్‌కతా-పంజాబ్‌ జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది.  పంజాబ్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లు చివరి బంతికి ఛేదించింది. కోల్‌కతా చివరి రెండు ఓవర్లలో 26 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో రస్సెల్‌ మూడు సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. దీంతో విజయ సమీకరణం ఆరు బంతుల్లో 6 పరుగులుగా మారింది. అయితే చివరి ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ కోల్‌కతాను భయపెట్టాడు. తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులే ఇవ్వడంతో ఉత్కంఠ పెరిగింది. ఐదో బంతికి రస్సెల్‌ రనౌట్‌ కావడంతో సమీకరణం చివరి బంతికి రెండు పరుగులుగా మారింది. దీంతో ఒత్తిడి చిత్తుచేస్తూ రింకు సింగ్‌ చివరి బంతిని ఫోర్‌ బాది కోల్‌కతాను గెలిపించాడు. దీంతో కోల్‌కతా సంబరాల్లో మునిగింది.   

Updated : 09 May 2023 02:40 IST
Tags :

మరిన్ని