Indore: పండగ వేడుకల్లో విషాదం.. బావిలో పడి 13 మంది మృతి

మధ్యప్రదేశ్ ఇందౌర్‌ (Indore)లో శ్రీరామ నవమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పటేల్‌నగర్‌ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలి.. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కాగా.. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై ఫ్లోరింగ్‌పై కూర్చున్నారు. బరువు ఆపలేక ఆ ప్రాంతం ఒక్కసారిగా కుంగిపోయి ఫ్లోరింగ్ కూలిపోయింది. దీంతో దాదాపు 35 మంది భక్తులు బావిలో పడిపోయారు.

Published : 30 Mar 2023 22:02 IST

Tags :

మరిన్ని