Nizamabad: నిజామాబాద్ కలెక్టరేట్‌లో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ కలెక్టరేట్‌లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలంరేపింది. గ్రామంలో చేసిన పనులకు బిల్లులు రావటంలేదంటూ నందిపేట గ్రామ సర్పంచ్ వాణి, ఆమె భర్తతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పనుల కోసం రూ.2కోట్ల వరకు అప్పులు చేశామని.. ఇప్పుడు అది రూ.4కోట్లకు పెరిగిపోయిందంటూ వాపోయారు. బిల్లులు రాకుండా ఉపసర్పంచ్, వార్డు సభ్యులు అడ్డుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 30 Jan 2023 15:53 IST
Tags :

మరిన్ని