Head Master: చదువు చెప్పడమే కాదు.. విద్యార్థుల కోసం జీతాన్ని వెచ్చిస్తున్నారు

విద్యార్థుల చదువు కోసం తన జీతాన్ని పాఠశాల అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. అంబికాపుర్ జిల్లాలోని చిఖ్‌లాడీ ప్రభుత్వ పాఠశాలలో 2012 నుంచి కృపాశంకర్  హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. తనకు వచ్చే వేతనంలో కొంతభాగాన్ని పాఠశాల అవసరాల కోసం ఖర్చు చేస్తున్నారు. స్కూల్‌కు పెయింటింగ్ చేయించడం, ప్రహారీ గోడలను నిర్మించడం వంటివి.. తన సొంత ఖర్చులతో చేశారు. అనేక ప్రభుత్వ పాఠశాలలను నిధుల కొరత వేధిస్తోందని కృపా శంకర్ చెబుతున్నారు. దీనికి సొంతంగా పరిష్కారం వెతుక్కోవాలని తోటి ఉపాధ్యాయులకు పిలుపునిస్తున్నారు. 

Published : 19 Mar 2023 20:01 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు