Accident: బ్రేకులు ఫెయిలై బీభత్సం సృష్టించిన ట్రక్కు .. 48 వాహనాలు ధ్వంసం
మహారాష్ట్ర పుణెలో బ్రేకులు ఫెయిలైన ఓ ట్రక్కు తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. అడ్డొచ్చిన వాహనాలను ఢీకొడుతూ పుణెలో నావేల్ వంతెనపై బీభత్సం చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కనీసం 30 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ట్రక్కు ఢీ కొనడంతో 48 వాహనాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. మరోవైపు ప్రమాద అనంతరం రోడ్డుపై వాహనాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్డుపై అడ్డంగా వాహనాలు పడిపోవడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
Published : 21 Nov 2022 11:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..