Viral Video: ‘మీపై కేసులు పెడతా..’ తెదేపా శ్రేణులకు ఎస్సై హెచ్చరిక

తరచూ మరమ్మతులతో 108 అంబులెన్స్‌ రోగులకు సకాలంలో సేవలు అందించలేకపోతుందంటూ నిరసన తెలిపిన తెలుగుదేశం నేతలపై కేసులు పెడతానంటూ.. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం ఎస్సై వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గర్భిణీలను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో 108 అంబులెన్స్ చక్రం ఊడిపోయింది. దీంతో 108 అంబులెన్స్ తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు. అక్కడికివచ్చిన స్థానిక ఎస్సై ఆందోళనకారులపై ఊగిపోవడం.. వాగ్వాదానికి దారితీసింది.

Published : 10 Jun 2023 12:38 IST

Tags :

మరిన్ని