Smriti Irani: పిల్లలకు పాఠాలు చెప్పిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!

నిత్యం రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండే కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. కొద్దిసేపు అంగన్‌వాడీ టీచర్‌గా దర్శనమిచ్చారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి స్థానిక అంగన్ వాడీ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లలకు కాసేపు పాఠాలు బోధించారు. పాఠశాలలో ఫొటోలతో కూడి ఉన్న పోస్టర్లను చూపిస్తూ పిల్లలకు ప్రశ్నలు కూడా వేశారు. అడిగిన ప్రశ్నలకు పిల్లలు కూడా వెంట వెంటనే సమాధానాలిచ్చారు.

Published : 05 Jun 2022 14:54 IST
Tags :

మరిన్ని