Sringeri: శృంగేరి శ్రీ మలహానికరేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం

కర్ణాటకలోని శృంగేరిలో శ్రీమలహానికరేశ్వర స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. ఆలయంకు మహారాజగోపురం నిర్మించిన సందర్భంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహాకుంభాభిషేకంలో భాగంగా తొలుత శ్రీస్తంభగణపతి ఆలయంలో కుంభాభిషేకం వేడుకగా నిర్వహించారు. అనంతరం శ్రీమలహానికరేశ్వర ఆలయంలో సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. భారతీతీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు శృంగేరి ప్రధాన ఆలయం ప్రాంగణంలో హోమాలు నిర్వహించనున్నారు.

Updated : 12 Feb 2023 13:48 IST

కర్ణాటకలోని శృంగేరిలో శ్రీమలహానికరేశ్వర స్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. ఆలయంకు మహారాజగోపురం నిర్మించిన సందర్భంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహాకుంభాభిషేకంలో భాగంగా తొలుత శ్రీస్తంభగణపతి ఆలయంలో కుంభాభిషేకం వేడుకగా నిర్వహించారు. అనంతరం శ్రీమలహానికరేశ్వర ఆలయంలో సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. భారతీతీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు శృంగేరి ప్రధాన ఆలయం ప్రాంగణంలో హోమాలు నిర్వహించనున్నారు.

Tags :

మరిన్ని