Vikarabad: మా సార్‌.. మా బడిలోనే ఉండాలి: విద్యార్థుల నిరసన

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లికలాన్‌లోని..  ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ సాధారణ బదిలీలో ఎక్కడికి వెళ్లొద్దంటూ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ‘మా సార్ మా పాఠశాలలోనే ఉండాలి’ అంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 12 ఏళ్లు ఇదే పాఠశాలలో విధులు నిర్వహిస్తూ.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 129 మంది విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారని తెలిపారు.  గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా కృషి చేసి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారని వెల్లడించారు.

Published : 30 Jan 2023 17:25 IST

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లికలాన్‌లోని..  ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ సాధారణ బదిలీలో ఎక్కడికి వెళ్లొద్దంటూ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ‘మా సార్ మా పాఠశాలలోనే ఉండాలి’ అంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 12 ఏళ్లు ఇదే పాఠశాలలో విధులు నిర్వహిస్తూ.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 129 మంది విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారని తెలిపారు.  గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా కృషి చేసి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారని వెల్లడించారు.

Tags :

మరిన్ని